29, అక్టోబర్ 2013, మంగళవారం

మురళీకృష్ణ'...నీ సుఖమే నే కోరుకున్నా...

            విషాద గీతాలలో ఈ పాట మధురమైనదని చెప్పాలి. ఎక్కువమంది విన్న పాట ,మన   అక్కినేని..నటిం(జీవి)చిన పాట...  1964 లో వచ్చిన 'మురళీకృష్ణ' చిత్రం లో  ఆత్రేయ సాహిత్యం,మాస్టర్ వేణు సంగీతం లో ఘంటసాల మధురం గా పాడిన పాట..నీ సుఖమే నే కోరుకున్నా....
పల్లవి:

ఎక్కడ ఉన్న ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం1:

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం2:

పసిపాప వలె ఒడి చేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను
గుండెను గుడిగా చేశాను నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం3:

వలచుట తెలిసిన నా మనసుకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం4:

నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
.............

          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి